ఏపీ సీఎం జగన్ ప్రధాని మోడీకి లేఖ ..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. 16 భాషల్లో 47 వేలకు పైగా పాటలు పాడిన గాన గంధర్వుడు ఎస్.పి బాలసుబ్రహ్మణ్యంకు భారతరత్న ఇవ్వాలని లేఖలో ప్రధానిని జగన్మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే బాలసుబ్రమణ్యంకు భారతరత్న ఇవ్వాలని పలువురు ప్రముఖులు కూడా కోరుతున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం కు భారతరత్న ఇవ్వాలని ప్రముఖ నటుడు అర్జున్ కూడా కోరారు. దీనికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి కూడా ఏపీ ప్రభుత్వం తరపున ప్రధాని నరేంద్ర మోడీ కి లేఖ రాశారు, భారత రత్న ఇవ్వాల్సిందిగా కోరాడు.

మరోవైపు ఆసుపత్రి బిల్లులపై జరుగుతున్న ప్రచారాన్ని బాలు కుమారుడు ఎస్పీ చరణ్ ఖండించారు. వైద్యం అందించిన చెన్నై MGM ఆస్పత్రి బాలు కుటుంబాన్ని చాలా ఇబ్బంది పెట్టిందని, మూడు కోట్ల రూపాయల బిల్లు వేసిందని, డబ్బు మొత్తం చెల్లించే వరకూ భౌతికకాయాన్ని కూడా అప్పగించ లేదని, చివరకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుమార్తె ఆసుపత్రి బిల్లులు చెల్లించడంతో సమస్య పరిష్కారమయ్యిందని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.

వెంకయ్యనాయుడు మీద అభిమానంతో ఈ పుకార్లు సృష్టించారు ఏమో గాని ఈ ప్రచారాన్ని ఎస్పీ చరణ్ ఖండించారు. ఇలాంటి పుకార్లు ఎందుకు సృష్టిస్తున్నారో అర్థం కావడం లేదు అని అన్నారు. ఇలాంటి ప్రచారాన్ని ఖచ్చితంగా బాలు అభిమానులు చేసి ఉండరని ఆయన అభిప్రాయపడ్డారు. (రామ జన్మభూమి అయోధ్యకు 613 కిలోల గంట.)

హాస్పిటల్ సిబ్బంది వైఫల్యం లేనే లేదని ఆయన వివరించారు. బిల్లుల విషయంలో తమను ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని, వారు అన్ని విధాలా సహకరించారని తెలిపారు. త్వరలోనే ఆసుపత్రి బిల్లులను కూడా వెల్లడిస్తామని అప్పుడు అందరికీ ఒక అవగాహన వస్తుందని మీడియా ముఖంగా వెల్లడించారు.

Leave a Comment