వాతావరణంలో పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. దీనికి తోడు కరోనా కూడా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుంది. వీటి ప్రభావం మానవ జాతి మీదనే కాకుండా వలస పక్షులపై కూడా పడిందని తెలుస్తోంది. ఎందుకంటే ఈ మధ్య మెక్సికోలో వలస పక్షులు కొన్ని వేల సంఖ్యలో మృతి చెందడం జరిగింది. మెక్సికోతో పాటు మరికొన్ని ప్రాంతాలైన టెక్సాస్, కొలరాడో మరియు అరిజోనాలలో పక్షులు కూడా అనుమానాస్పదంగా మృతి చెందాయి. దీనికి గల కారణం పరిశోధకులకు కూడా అంతుచిక్కక పోవడం ఆందోళనలకు గురిచేస్తుంది.
మృత్యువాత పడిన జాబితాలో బ్లూ బర్డ్, బ్లాక్ బర్డ్, ఫ్లై కాచర్స్ జాతి పక్షులు ఎక్కువగా వున్నాయి. వీటి మరణానికి అసలు కారం పూర్తిగా తెలియనప్పటికీ, మెక్సికోలో ఏర్పడిన కరువు, వాతావరణ పరిస్థితులు దానికి తోడు పశ్సిమంలో ఏర్పడిన కార్చిచ్చు కారణం అయి ఉండవచ్చని మరికొందరి పరిశీలకుల అభిప్రాయంగా తెలుస్తుంది. ( తస్మాత్ జాగ్రత్త..!! )
దీనిపై స్పందించిన ఎన్ఎస్ఎమ్యూ జీవ శాస్త్రవేత్త అయిన మార్తా డెస్మాండ్, ఇంత పెద్ద సంఖ్యలో పక్షులు మరణించడం చాలా తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని, ఇదే పరిస్థితి మరికొంత కాలం కొనసాగే అవకాశం లేకపోలేదని అన్నారు.
మొదటగా పక్షులు ఎక్కువ మొత్తంగా ఇలా మరణించడాన్ని యూఎస్ ఆర్మీ దళాలు ఆగస్టులో గుర్తించాయి. యూఎస్ లోని పరికొన్ని ప్రాంతాల్లో ఇటువంటి సంఘటనలు ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఈ వన్య ప్రాణులు మరియు వలస పక్షుల మరణాలపై జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …