పాఠశాలలకు హాజరు కావాల్సిందే..

ఇవాళ్టి నుంచి తప్పని సరిగా విధులకు హాజరు కావాలని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు ఆంధ్ర ప్రదేశ్ పాఠశాల విద్యా సంచాలకులు చిన వీరభద్రుడు ఆదేశించాడు.

విద్యా సంవత్సరం మొదలైనప్పటినుంచి కరోనా కారణంగా స్కూళ్లన్నీ తాత్కాలికంగా మూతపడటంతో, ఉపాధ్యాయులు తమ బోధనను ఆన్లైన్ క్లాసుల ద్వారా అందిస్తున్నారు.ఇప్పుడు తీవ్రత తగ్గుముఖం పట్టడంతో కేంద్ర ప్రభుత్వ లాక్ డౌన్ సడలింపులో భాగంగా తీసుకున్న ఈ నిర్ణయం విద్యార్థులకు కొంత ఊరట కలిగించే అంశమే. ( ప్రస్తుతానికి కాస్త ఊరటే .. )

కోవిడ్ -19 రూల్స్ ప్రకారం అందరు మాస్కులు ధరించడంతో పాటు, సోషల్ డిస్టెన్స్ మరియు తదితర శానిటైజేషన్ జాగ్రత్తలు తీసువోవ్వాల్సిన బాధ్యత ఆ పాఠశాలలదే అని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

అయితే 1వ తరగతినుండి 8వ తరగతి వరకు ఆన్లైన్ లోనే తమ విద్యను కొనసాగించాలి. 9 ఉంది 10వ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు మాత్రం హాజరు కావాల్సి ఉంటుందని విద్యాశాఖ తెలిపింది. విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి కనీసం 50 శాతం మంది ప్రాధమిక మారియు ప్రాధమికోన్నత టీచర్లు విధులకు హాజరు కావాలని తెలిపారు.

Leave a Comment