వాట్సాప్ కు పోటీగా భారత ప్రభుత్వ రూపకల్పనలో ఒక కొత్త ఆప్ ..! Sandes Portal

Sandes Portal | గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ మరియు వాట్సాప్… ఇలా చెప్పుకుంటూ పోతే మనం నిత్యం వాడే ఈ సోషల్ మీడియా మాధ్యమాలలో 99 శాతం వరకు మన దేశానికి సంబంధించినవి కావు. వాటికి సంబంధించిన సర్వర్లు ఆయా దేశాలలో ఉంటాయి. దానర్థం మన డేటా వారి గుప్పెట్లో వున్నట్టే.

పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ప్రపంచమంతా తనను చూడట్లేదులే అని అనుకోవడంలో ఎంత మూర్ఖత్వం ఉందో, మనం వాడుతున్న ఈ సోషల్ మీడియా మాధ్యమాల్లో మన ప్రైవసీకి డోకా లేదు అని అనుకోవడంలో కూడా అంతే మూర్ఖత్వం వుంది.

ముఖ్యంగా వాట్సాప్ గురించి మనం ఖచ్చితంగా మాట్లాడాలి. ఈ మధ్యనే ఈ సంస్థ ప్రైవసీ నియమాలను మార్చి వినియోగదారుల ఆగ్రహానికి గురైన ఈ మెసేజ్ యాప్ రానున్న కాలంలో నిజంగానే అంత సేఫ్ యాప్ గా నిలువక పోవచ్చు.

ఇక భారత ప్రధాని మోదీ పిలుపుతో మాక్ ఇన్ ఇండియా మూమెంట్, ఆత్మ నిర్భర్ భారత్ నినాదం ఊపందుకుందనే విషయం మనందరికీ తెలిసిందే. చైనా అయినా, అమెరికా అయినా ఎందుకు మనం ఇంక చిన్న చిన్న వాటికి కూడా వారి పైనే ఆధార పడటం..? ఇది నిజంగా చాలా దౌర్భాగ్యం.

మన మేధస్సు విదేశీ కంపెనీలలో డాలర్ల వర్షం కురిపిస్తూ ఉంటే.. ఆ మేధస్సునే ఇక్కడ ఎందుకు ఉపయోగించరాదు. దానికి సంబంధించిన అనుకూల పరిస్థితులు ఎందుకు కేటాయించరాదు. గతం అలా గడిచింది కానీ ప్రస్తుతానికి కేంద్రం మాత్రం మేడిన్ ఇండియాకి పెద్ద పీట వేస్తోంది.

ఇందులో భాగంగా ఇటీవల పలు వివాదాల్లో చిక్కుకున్న వాట్సాప్ కు దీటుగా.. పోటీగా మన గవర్నమెంట్ ఒక యాప్ ను పరిచయం చేసింది. ఇందులో ఫీచర్స్ ప్రారంభదశలోనే అబ్బుర పరిచేలా, యూజర్ ఫ్రెండ్లీ గా ఉన్నాయి. ఆ యాప్ పేరు సందేశ్.

వాట్సాప్, ఇతర మెసేజ్ యాప్ లకు పోటీగా భారత ప్రభుత్వం ఈ యాప్ ను అభివృద్ధి చేసింది. ఈ యాప్ ను పరీక్షిస్తున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. సందేశ్ యాప్ ను ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ ( NIC ) ప్రారంభించారు.

గతంలో ప్రభుత్వ ఉన్నతాధికారుల కోసం అభివృద్ధి చేసిన గవర్నమెంట్ ఇన్స్టెంట్ మెసేజింగ్ సిస్టమ్ ( GIMS ) ను అప్ గ్రేడ్ చేసి సందేశ్ యాప్ గా రూపొందించారు. ప్రస్తుతం ప్రభుత్వ అధికారులతో పాటు వ్యక్తిగత వినియోగదారులకు కూడా దీన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

ఇతర మెసేజ్ యాప్ లో మాదిరిగానే సందేశ్ యాప్ ఓపెన్ చేసి కాంటాక్ట్స్ లో ఉన్నవారికి మెసేజ్ లు పంపవచ్చు. గ్రూప్ చాట్, ఆడియో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. మల్టీమీడియా కంటెంట్ తో పాటుగా కాంటాక్ట్ షేరింగ్ ఆప్షన్ కూడా ఈ యాప్ లో ఉంటుంది.

Sandes Portal ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ..

స్మార్ట్ ఫోన్ యూజర్లు GIMS పోర్టల్ ద్వారా సందేశ్ యాప్ apk ఫైల్ ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇది ఆండ్రాయిడ్ 5.0 తర్వాత వచ్చిన ఆండ్రాయిడ్ డివైస్ లలో పనిచేస్తుంది. ఐఓఎస్ వినియోగదారులు నేరుగా యాప్ స్టోర్ లో సందేశ్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకుని వాడుకోవచ్చు. ios 12.0 తో పనిచేసే ఐఫోన్, ఐపాడ్, ipod touch వంటి డివైస్ లలో ఈ యాప్ పనిచేస్తుంది.

DOWNLOAD

ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ఇచ్చి signup చేసుకోవాలి. తర్వాత మొబైల్ నెంబర్ కి వచ్చే otp ని ఎంటర్ చేయాలి. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాట్సాప్ మాదిరిగానే ప్రొఫైల్ ను ఎడిట్ చేసుకోవచ్చు.. స్టేటస్ లో పెట్టుకోవచ్చు. అన్ని రకాల మెసేజ్ సేవలను వినియోగించుకోవచ్చు.

కానీ కేవలం ఈమెయిల్ ద్వారా యాప్ ను రిజిస్టర్ చేసుకునేందుకు సాధారణ వ్యక్తులకు ప్రస్తుతం అనుమతి లేదు. కేవలం గవర్నమెంట్ డాట్ ఇన్ తో ఉండే ప్రభుత్వ ఈమెయిల్ ఐడిలకు మాత్రమే ఈ అవకాశం ప్రస్తుతానికి కల్పించారు. దీంట్లో వాట్సాప్ మాదిరిగానే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ సెక్యూరిటీ సిస్టం ఉంటుంది. ఈ వ్యవస్థ భద్రతకు భరోసా కల్పిస్తుంది.

ఈ ఆప్ ఇప్పటికే ఎటువంటి బగ్స్ లేకుండా ఉంది. రానున్న రోజుల్లో అప్గ్రేడెడ్ వెర్షన్ లో ఇంకా అద్భుతంగా ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఈ సందేశ్ యాప్ వాట్సాప్ కు గట్టి పోటీ ఇస్తుందనడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. మన ఫోన్ లో సందేశ్ యాప్ ఉండగా సందేహాలు ఎందుకు దండగ అని చెప్పుకోవచ్చు.

Leave a Comment