స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు రష్మిక మందనల కాంబినేషన్లో తెరకెక్కబోతున్న యాక్షన్ అండ్ రొమాంటిక్ మూవీ చిత్రం ‘పుష్ప’. ఈ చిత్రం పోస్టర్ విడుదల అయినప్పటి నుంచి అభిమానులు ఎంతగానో సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. అందులో ఫిదా బ్యూటీ సాయి పల్లవి కూడా ఒక కీలక పాత్ర పోషించనుంది అని తెలుస్తోంది. పుష్ప సినిమాలో అల్లు అర్జున్కి చెల్లెలు పాత్ర పోషించడానికి డైరెక్టర్ సుకుమార్, సాయి పల్లవిని సంప్రదించగా , తానూ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది. అదీ నిజమైతే ఈ సినిమాలో అల్లు అర్జున్కి చెల్లెలిగా సాయి పల్లవి కనిపించనున్నది. ( ఇంతకీ కీర్తి సురేష్ ఉన్నట్లా.. లేనట్లా.. !! )
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం గంధపు చెక్కల అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ పాత్రలో కొత్త లుక్ లో కనిపించనుండగా, రష్మిక మందన్న పల్లెటూరి అమ్మాయి గెటప్ లో కనిపించనుంది. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్ర పోషించనున్నారు. ఈ థ్రిల్లర్ డ్రామా చిత్రంలో బన్నీ రెండు వేర్వేరు షేడ్స్లో కనిపించనున్నట్లు చిత్ర పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా క్లైమాక్స్లో ఓ పెద్ద ట్విస్ట్ అభిమానుల అంచనాలను మరింత పెంచుతోందని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ప్రస్తుతం సాయి పల్లవి నాగ చైతన్య సరసన ‘లవ్ స్టోరీ’ సినిమాలో చేస్తూ, అలాగే రానా దగ్గుబాటికి జోడిగా ‘విరాట పర్వం’ సినిమాలో నటించనుంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …