రిలయన్స్ దిగ్గజం గ్రూప్లోని డిజిటల్ వ్యాపార విభాగం జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఇప్పుడు రిలయన్స్ రిటైల్లోనూ ఇన్వెస్ట్ చేసేందుకు లైను కడుతున్నారు. తాజాగా రిలయన్స్ రిటైల్ వెంచర్స్ (ఆర్ఆర్వీఎల్)లో అమెరికాకు చెందిన ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్ పార్ట్నర్స్ 1.75 శాతం వాటా కొనుగోలు చేయనుంది. ఇందుకోసం రూ. 7,500 కోట్లు వెచ్చించనుంది. ఆర్ఆర్వీఎల్ బుధవారం ఒక ప్రకటనలో ఈ విషయాలు వెల్లడించింది.
ఈ పెట్టుబడుల ప్రకారం ఆర్ఆర్వీఎల్ విలువ సుమారు రూ. 4.21 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొంది. సిల్వర్ లేక్ ఇప్పటికే జియో ప్లాట్ఫామ్స్లో 1.35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేసింది. రిలయన్స్ గ్రూప్ కంపెనీల్లో ఇది రెండో ఇన్వెస్ట్మెంట్.
లక్షల కొద్దీ చిన్న వర్తకులతో భాగస్వామ్యం ఏర్పర్చుకోవడంతో పాటు వినియోగదారులకు మరింత విలువైన సేవలు అందించే మా ప్రయత్నాల్లో సిల్వర్ లేక్ కూడా భాగస్వామి కాబోతుండటం సంతోషకర విషయం.ఈ రంగంలో టెక్నాలజీతో పెను మార్పులు తేవచ్చని విశ్వసిస్తున్నాం. భారతీయ రిటైల్ రంగానికి సంబంధించి మా ప్రణాళికలు అమలు చేయడంలో సిల్వర్ లేక్ విలువైన భాగస్వామి కాగలదు అని ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఎండీ ముకేశ్ అంబానీ పేర్కొన్నారు.
“రిలయన్స్తో మా బంధం మరింత బలపడటం సంతోషకర విషయం. ముకేశ్ అంబానీ, రిలయన్స్ టీమ్ కలిసి నిబద్ధత, విజన్తో రిటైల్, టెక్నాలజీ రంగంలో ఒక ప్రపంచ స్థాయిగా నిలిచారు. కరోనా వైరస్ ఎక్కువగా ఉన్న పరిస్థితుల్లోనూ జియోమార్ట్ చాలా స్వల్ప వ్యవధిలోనే దూసుకుపోతుండటం అసాధారణమైన విషయం” అని సిల్వర్ లేక్ సహ-సీఈవో ఎగాన్ డర్బన్ తెలిపారు. ఈ డీల్కు నియంత్రణ సంస్థపరమైన అనుమతులు రావాల్సి ఉంది.
సిల్వర్ లేక్ జియోలో కూడా..
ఫేస్బుక్ తర్వాత జియో ప్లాట్ఫామ్స్లో ఇన్వెస్ట్ చేసిన తొలి అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ సిల్వర్ లేక్. సుమారు రూ. 10,203 కోట్లతో రెండు విడతల్లో 2.08 శాతం వాటా కొనుగోలు చేసింది. ఆ తర్వాత కేకేఆర్, విస్టా, జనరల్ అట్లాంటిక్, గూగుల్ మొదలైనవి జియోలో ఇన్వెస్ట్ చేశాయి. ట్విటర్, ఎయిర్బీఎన్బీ, ఆలీబాబా, డెల్ టెక్నాలజీస్ వంటి పలు టెక్ దిగ్గజాల్లో సిల్వర్ లేక్ పెట్టుబడులు పెట్టింది.
కేకేఆర్ కూడా ..
జియో ప్లాట్ఫామ్స్లో పెట్టుబడులు పెట్టిన వారికి .. తమ రిటైల్ విభాగంలో కూడా ఇన్వెస్ట్ చేసేందుకు రిలయన్స్ ఆఫర్ ఇచ్చింది. దీనికి అనుగుణంగానే సిల్వర్ లేక్ ఇన్వెస్ట్ చేస్తోంది. జియోలో ఇన్వెస్ట్ చేసిన మరో ఈక్విటీ సంస్థ కేకేఆర్ కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. సుమారు రూ.11,100 కోట్లు పెట్టుబడులు పెట్టొచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …