ఏపీ ప్రభుత్వం అమూల్ సంస్థతో ఒప్పందం చేసుకోవడం పై టీడీపీ నేత నారా లోకేష్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ లాబీల్లో మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేసిన ఆయన రాష్ట్రంలో డైరీలు అభివృద్ధి చేస్తే నేరమా అని ప్రశ్నించారు.
ఎక్కడో గుజరాత్ నుంచి అమూల్ ను తెచ్చి నెత్తిన పెట్టుకోవడం ఏంటని విమర్శించారు. పాలు అన్నీ అమూల్ కే వెళితే పాలు అందక హెరిటేజ్ మూతపడుతుందన్న ప్రచారంపై నారా లోకేష్ స్పందించారు.
అమూల్ వచ్చినా తమకేం ఇబ్బంది లేదని.. ఇక్కడ పాలు సరిగా లేకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్లి హెరిటేజ్ పాలు సేకరిస్తుందని చెప్పారు. తమకు ఆ సామర్థ్యం ఉందని నారా లోకేష్ వివరించారు.
ప్రైవేట్ డైరీలు తమకు మాత్రమే కాదని, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కూడా ఉందని లోకేష్ చెప్పారు. శివశక్తి పేరుతో పెద్దిరెడ్డి కుటుంబానికి కూడా డైరీ ఉంది అని, అందరి కంటే తక్కువ ధర పాలకు చెల్లించే సంస్థ కూడా శివశక్తి డైరీనే అని చెప్పారు.
పెద్దిరెడ్డి కంపెనీ పాలు సేకరించే ప్రాంతంలో ఇతర డైరీలను అడుగుపెట్టనివ్వవరని, అందుకే అక్కడ తక్కువ ధరకే రైతులనుంచి పాలు సేకరిస్తున్నారని లోకేష్ వెల్లడించారు. లోకేష్ చెప్పిన దానిలో రెండు అంశాలను పరిగణలోనికి తీసుకుంటే.. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమూల్ తో చేసుకున్న ఒప్పందం సరైనది అని అనిపిస్తుంది.
ఇక్కడ పాలు అందకపోతే పక్క రాష్ట్రాలకు వెళ్తామని లోకేష్ చెప్పడం బట్టి అమూల్ రాకతో రైతులకు ఎక్కువ ధర లభించబోతోందని పరోక్షంగా అంగీకరించినట్టుగా వుంది. తాము అధిక ధర చెల్లించలేం కాబట్టి పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడ తక్కువ ధరకు రైతుల నుంచి పాలు కొంటామని నారా లోకేష్ చెబుతున్నట్టుగా ఉంది.
రైతుల మీద ప్రేమతో కాదు హెరిటేజ్ ను దెబ్బతీయాలనే కుట్రతోనే జగన్మోహన్రెడ్డి అమూల్ ను తెస్తున్నారు అన్న చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు అని నారా లోకేషే అంగీకరిస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి కి చెందిన డైరీ కూడా తక్కువ ధరకు పాలు కొంటుందని నారా లోకేషే చెబుతున్నారు.
ఆ లెక్కన అమూల్ రాకతో పెద్దిరెడ్డి కుటుంబానికి కూడా నష్టం కలగవచ్చు. పలువురు వైసీపీ వాళ్ళకు కూడా డైరీలు ఉన్నాయి. అయినప్పటికీ అమూల్ తో ఒప్పందం చేసుకుంటున్నారు అంటే పోటీ పెరిగి రైతులకు అధిక ధర దక్కాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశం అన్న భావనకు నారా లోకేష్ వ్యాఖ్యలు కూడా బలాన్ని చేకూరుస్తున్నాయి.
అమూల్ రాకతో ఏర్పడిన పోటీని తట్టుకునేందుకు హెరిటేజ్ సంస్థ ఇంతకాలం తనకు పాలు పోసిన రైతులకు అధిక ధర చెల్లిస్తుందో లేదా నారా లోకేష్ చెప్పినట్టుగానే పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడి రైతుల నుంచి తక్కువ ధరకు పాలు కొంటారో చూడాలి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …