పానీపూరి ఓ మహిళ ప్రాణం తీసింది. అదేంటి పానీపురి తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని తినేందుకు చాలామంది ఎగబడుతుంటారు. అలాంటి పానీపురి ఒక మహిళ ప్రాణాలు తీయడమేంటని అనుకుంటున్నారా.. నిజంగా ఇది నమ్మాల్సిందే. ఈ ఘటన ఒడిశాలోని సుందరగడ్ జిల్లా సరఫ్గడ్లో జరిగింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారంం పూలమతి అనే మహిళకు పానీపూరి తినాలనిపించింది. వెంటనే తన కుటుంబంతో కలిసి గప్చుప్ బండి దగ్గరికి వెళ్లింది. గప్చుప్ బండి అతను పానీపూరి ఆమె చేతితో పెట్టగానే వెనకా ముందు ఆలోచించకుండా.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా గుటుక్కన మింగింది. వెంటనే ఆమె స్పృహతప్పి కిందిపడి చనిపోయింది. ఏమిటి.. పానీపురి నోట్లో వేసుకోగానే పడిపోయిందా.. వెంటనే చనిపోయిందా..? అలా అయితే, దానిలో ఏదో విష పదార్థం ఉందన్న అనుమానం వస్తుంది కదా.. మీరు అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. ఇంతకు ఆ మహిళ ఎందుకు స్పృహతప్పి పడిపోయిందంటే పానీపూరి నమలకుండా మింగడంతో గొంతులో ఇరుక్కపోయి శ్వాస ఆడక చనిపోయింది.
చూశారా. మనకు ఎంత ఇష్టమైన ఆహారమైనా సరిగా నమలకుండా తింటే ఏమవుతుందో.. ఆ ఆతృతే ఆ మహిళ ప్రాణాలను తీసింది మరి.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …
- బయటకొచ్చిన తీన్మార్ మల్లన్న.. టార్గెట్ ఫిక్స్..!!తీన్మార్ మల్లన్నకు తెలంగాణ హైకోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. రెండు నెలలకు …
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?కుప్పం మున్సిపాలిటీలో తన పార్టీ గెలుపుపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు …