ఇంతకీ కీర్తి సురేష్ ఉన్నట్లా.. లేనట్లా.. !!

మహేష్ బాబు అప్‌కమింగ్ మూవీ మైత్రి మూవీ మేకర్స్, మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ బ్యానర్లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం సర్కారు వారి పాట. అయితే ఈ సినిమా నుంచి కీర్తి సురేష్ తప్పుకుందని, ఆమె స్థానంలో మరో హీరోయిన్ నటిస్తుందని వార్తలు వచ్చాయి.

తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానం ఏర్పరుచుకున్న హీరోయిన్ కీర్తి సురేష్. ఈ మధ్యన తన అభిమానులతో ఆస్క్ మీ ఎనిథింగ్‌ అంటూ ఆన్‌లైన్ చాటింగ్ లో పాల్గొన్నప్పుడు, తన తదుపరి చిత్రం సర్కారు వారి పాట అని అందులో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరొయిన్‌గా నటించనున్నట్లు చెప్పుకొచ్చింది. కానీ ఈ సినిమాలో మహేష్ బాబుకు జంటగా నటించేది ఎవరది ప్రొడ్యూసర్స్ నుంచి మాత్రం ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. ( అక్టోబర్ 23న ప్రభాస్ ఫాన్స్ కి సర్ప్రైజ్ గిఫ్ట్ .. )

సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గురించి ఈ సినిమా వర్గాలు కొందరు చెబుతున్న దాని ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్‌గా చేయబోతోంది కీర్తి సురేష్ అని తెలుస్తోంది. అంతే కాకుండా కీర్తి సురేష్‌ షూటింగ్ షెడ్యూల్యు ఖరారైందని , ఎస్‌లో జరగబోయే షూటింగ్ కోసం వీసా, వర్క్ పర్మిట్ కోసం కూడా చిత్ర యూనిట్ దరఖాస్తు చేసింది అని సభ్యులనుంచి సమాచారం. అదే నిజమైతే.. సర్కారు వారి పాటలో మహేష్ బాబుకు జంటగా కనిపించబోయే హీరోయిన్ కీర్తి సురేషే అవుతుంది.

అలాగే తాను నటించిన లేటెస్ట్ మూవీ ‘గుడ్ లక్ సఖి’ సినిమా టీజర్ ఆగష్టు 15న విడుదలైంది. ఈ చిత్రం OTTలో విడుదల కానుంది అని టాక్ వినిపిస్తోంది.

Leave a Comment