బెంగుళూరులో కురుస్తున్న భారీ వర్షాలు..

వాతావరణంలో మార్పులు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరులో గత రెండురోజుల నుండి భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సుమారు 45 నుండి 90 మిల్లీ మీటర్ల వర్షపాతం సంభవించినట్టు పేర్కొంది.

EhbbEOAUwAAgeej
Ehc7uUfVoAUf3MT

ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వార్డులకు వార్డులే నీట మునిగాయి. రోడ్లు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మురుగు నీరు అపార్టుమెంట్లలోకి చేరడంతో సెల్లార్ లోని వాహనాలు నీట మునిగాయి. ఇళ్లలోకి 5 నుండి 6 అడుగుల మేర నీరు చేరడంతో ఇంట్లోని టీవీలు, ఫ్రిడ్జ్ లు మరియు ఇతర విలువైన సామాగ్రి పాడైపోయాయి. హెబ్బాళ మరియు చుట్టుపక్కల అండర్ పాస్ లు నీట మునిగాయి.

విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. అగ్రహార దాసరాహళ్ళి, హెబ్బాళ,హోరమావు ,మూడలపాళ్య లలో అధిక వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖా పేర్కొంది. మరో రెండు రోజులు ఇలాగే వుండే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

Leave a Comment