గూగుల్ సెర్చి ఇంజిన్ తాజాగా పీపుల్ కార్డ్స్ పేరిట కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఆన్లైన్ మరియు వెబ్సైటు అవసరాలకు వర్చువల్ విజిటింగ్ కార్డులను రూపొందించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.
దీన్ని మొదటిసారిగా భారత్లోనే ప్రవేశపెట్టినట్లు గూగుల్ సెర్చ్ ప్రోడక్ట్ మేనేజర్ తెలిపారు. కోట్ల సంఖ్యలో వ్యక్తులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగార్థులు, స్వయం ఉపాది పొందుతున్నవారు, ఫ్రీలాన్సర్లు మొదలైన వారందరికీ ఇది ఉపయోగపడగలదని ఆమె వివరించారు.
దీని ద్వారా సరైన సమాచారం ఇవ్వడం ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. ప్రస్తుతానికి ఇది మొబైల్లో మాత్రమే సపోర్ట్ చేస్తోంది.
దీని కోసం గూగుల్ సెర్చి్లో ‘యాడ్ మీ టు సెర్చ్’ అని టైప్ చేయాలి. ఆ తర్వాత యాడ్ యువర్సెల్ఫ్ టు గూగుల్ సెర్చ్ అనే పేజి వస్తుంది.
అందులో గెట్ స్టార్టెడ్ ఆప్షన్ ఎంచుకుని వెబ్సైట్ అడ్రెస్, సోషల్ నెట్వర్క్ ప్రొఫైల్స్, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్ నంబరు తదితర వివరాలను పొందుపర్చి సేవ్ చేయాల్సి ఉంటుంది.
తద్వారా వర్చువల్ కార్డు సిద్ధమవుతుంది. ఆన్లైన్లో దీన్నే విజిటింగ్ కార్డుగా ఉపయోగించవచ్చని గూగుల్ తెలిపింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …