హైదరాబాద్ నగరానికి మరో అత్యాధునిక నిర్మాణమైన దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి భాగ్యనగర ఖ్యాతిని మరింత ప్రకాశింపజేసేలా ఉంది. బ్రిడ్జి అందాలు నగరానికే ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి. ఇది ఆసియాలోనే పెద్దదైన అద్భుతమైన కేబుల్ వంతెనగా గుర్తించబడింది. ఈ వంతెనను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు అంకితం చేసింది.
రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జిని కేంద్రమంత్రి జీ. కిషన్రెడ్డి తో కలిసి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి తారక రామారావు ప్రారంభించారు. దీంతోపాటు దుర్గంచెరువులో బోటింగ్ను, కేబుల్ వంతెనకు అనుసంధానంగా జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 45 నుంచి నిర్మించిన ఎలివేటర్ కారిడార్ను కూడా వారు ప్రారంభించారు. దీనికి ‘పెద్దమ్మతల్లి ఎక్స్ప్రెస్ వే’ గా నామకరణం చేశారు. ( భారత్ లో బైక్ అమ్మకాలు )
735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో దుర్గం చెరువుపై నాలుగు లేన్లతో నిర్మించిన ఈ కేబుల్ వంతెనతో జూబ్లీహిల్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య దూరంతోపాటు, ట్రాఫిక్ తగ్గనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం మంత్రులు దుర్గంచెరువులో బోటింగ్ చేశారు. నేతలు, అధికారులతో కలిసి పడవలో ప్రయాణిస్తూ అందాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్తోపాటు మంత్రులు తలసాని,మహమూద్ అలీ, శ్రీనివాస్గౌడ్, సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి తదితతరులు పాల్గొన్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …