Gao Fu : మార్కెట్లో ఏ వస్తువైనా ఆకర్షణీయంగా కనిపిస్తూ తక్కువ రేటుకే లభిస్తే అది ఖచ్చితంగా చైనాదే అయి ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. కానీ నాణ్యత విషయంలో మాత్రం ఎలాంటి గ్యారెంటీ ఉండదు. అది చైనా వస్తువు ప్రత్యేకత. చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలయినా.. ప్రాణాలు కాపాడే వాక్సిన్ లయినా చైనా బ్రాండ్ ఇమేజ్ ఏమాత్రం తగ్గదు మరి. తన బ్రాండ్ ఇమేజ్ ను మరోసారి నిరూపించుకుంది చైనా.
WHO టీంను సైతం
కరోనాను ప్రపంచం మీదకు ఉసిగొల్పి పబ్బం గడుపుకుంటున్న చైనాలో అంతర్గత రహస్యాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కరోనా మూలాలను దాచేసి WHO టీంను సైతం మాయచేసిన జిత్తులమారి చైనా.. టీకాల విషయంలోనూ నక్కజిత్తులు ప్రదర్శించింది.
ఇన్నాళ్లు తమ టీకాల గురించి గొప్పలు పోయిన చైనాకు స్వయంగా ఆ దేశ ఉన్నతాధికారే షాకిచ్చాడు. తమ స్వదేశీయ వాక్సిన్ లకు కరోనా నుంచి కాపాడే సామర్థ్యం అధికంగా లేదని చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ చీప్ గావోఫు (Gao Fu) బాంబు పేల్చారు. అంతే కాదు అసలు ఈ వాక్సిన్ లను వినియోగించాలా.. వద్దా అన్నదానిపై సమాలోచనలు జరుపుతోందని అన్నారు.
ఈ సమస్యను పరిష్కరించడానికి రెండు మార్గాలను పరిశీలిస్తున్నామని తెలిపారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రెండు టీకాలను కలిపి వాటి సామర్థ్యాన్ని పెంచే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు. డోసులకు మధ్య విరామం లేదా మోతాదుల సంఖ్యను పెంచడం లేదా వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించే వాక్సిన్ లను కలపడం తమ ముందున్న మార్గాలని తెలిపారు.
క్లినికల్ ట్రయల్స్ లో బయటపడ్డ వాక్సిన్ సామర్ధ్యం
సాధారణంగా రెండు వేరు వేరు వాక్సిన్ లను కలిపి అందజేయడాన్ని ప్రపంచ ఆరోగ్య నిపుణులు సమర్థిస్తున్నారని.. ఎందుకంటే ఇది సురక్షితమైందన్నారు గావోఫు (Gao Fu). బ్రిటన్, ఇతర దేశాల్లో ఈ తరహా క్లినికల్ ట్రైల్స్ నిర్వహించాయని గుర్తుచేశారు. ఇతర దేశాల టీకాలపై ఒకప్పుడు అక్కసు వెళ్లగక్కిన చైనా, ఇప్పుడు తమ వాక్సిన్ లపై తమ అధికారులలే పెదవి విరుస్తుండటంపై నిజాన్ని అంగీకరించక తప్పలేదు.
MRNA విధానంలో కోవిడ్ టీకాలను అభివృద్ధి చేయడాన్ని గతంలో తప్పుబట్టిన గావోఫు.. దీని వల్ల దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ప్రస్తుతం మాటలను వెనక్కి తీసుకొని MRNA విధానంలో టీకాలు తయారు చేసే ప్రక్రియను పరిగణలోకి తీసుకోవాలని సూచించారు.
చైనా టీకాను సంప్రదాయిక ఉత్పత్తి విధానాన్ని ఉపయోగించి తయారు చేస్తారు. చైనాకు ఫార్మా సంస్థ SINOVAC రూపొందించినటువంటి కరోనా టీకాను 50.4 శాతం సామర్ధ్యం మాత్రమే ఉందని బ్రెజిల్ వెల్లడించింది. అదే అమెరికాలో అభివృద్ధి చేసిన ఫైజర్ టీకా సామర్ధ్యం 97 శాతం అని రుజువైంది. అలాగే oxford Astrazeneca టీకా 78 శాతం మేర ప్రభావవంతంగా పని చేస్తున్నట్లుగా క్లినికల్ ట్రయల్స్ లో వెల్లడైంది.
ఇప్పటివరకు చైనాలో 34 మిలియన్ల మంది రెండు డోసుల టీకాను అందుకున్నారు. మరో 64 మిలియన్ల మందికి ఒక డోసు టీకాను వేశారు. ఇక టీకా దౌత్యం పేరిట వివిధ దేశాలను బుట్టలో వేసుకునేందుకు చైనా చేసిన ప్రయత్నాలు కూడా వర్కవుట్ అవ్వలేదు. ఇలా చైనా అధికారులే బహిరంగంగా ఆ దేశానికి చెందిన కోవిడ్ టీకాల పనితీరుపై మాట్లాడటం సంచలనంగా మారింది.
కరోనా వైరస్ ను ప్రపంచానికి పరిచయం చేసిన చైనా, దాని అంతానికి తొలి వాక్సిన్ ని కనుగొన్నది తామేనని జబ్బలు చరుచుకుంది. కానీ దాదాపుగా ఏడాది తరువాత చైనా దేశం తయారుచేసిన కరోనా వాక్సిన్ వట్టి డొల్లేనని ఆ దేశానికి చెందిన అధికారే ఒప్పుకోవడంతో చైనా ఏది చేసిన నాసిరకంగా ఉంటుంది అన్నది మరోసారి రుజువైంది.
చైనా దేశంలో జరిగేది ఒకటి.. బయట ప్రపంచానికి తెలిసేది మరోటని గావోఫు మాటల ద్వారా స్పష్టం అవుతోంది. ఇదిలా ఉంటే నిజం చెప్పిన గావోఫుకు ఇప్పుడు భయం పట్టుకుంది. ఎందుకంటే అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక అంతే. కరోనా గురించి బయటపెట్టిన డాక్టర్లు, సైంటిస్టులు, జర్నలిస్టుల గతి ఏమైందో ప్రపంచం మొత్తం చూసింది. దీంతో ఆందోళనకు గురయ్యాడో.. ఏమో తన వ్యాఖ్యలను వక్రీకరించారని కొత్త భాష్యం మొదలు పెట్టాడు గావోఫు.
నిజానికి గావోఫు వ్యాఖ్యలను చైనా మీడియా పెద్దగా చూపించడం లేదు. అయితే ఆయన మొదట మాట్లాడినప్పుడు చైనా స్వదేశీ సోషల్ మీడియా సైట్ weibo లో విమర్శలు వచ్చాయి. మీరు మాట్లాడటం ఆపేస్తే మంచిది అని కామెంట్స్ కూడా కనిపించాయి. మొత్తానికి నాసిరకంలో తాము నెంబర్ వన్ అని నిరూపించుకుంది చైనా. కానీ పాకిస్థాన్ మాత్రం ఈ వాక్సిన్ ను ఇప్పటికీ దిగుమతి చేసుకుని అక్కడ లక్షల మందికి ఆ టీకాలు వేస్తోంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …