కుప్పం మున్సిపాలిటీలో తన పార్టీ గెలుపుపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అనుమానం ఉందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. గత 35 ఏళ్లుగా కుప్పం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబుకు ప్రత్యేకంగా ఆయన నియోజకవర్గంలో ఓటమిపై సందేహం కలిగించడంలో ప్రత్యర్థి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ( మా బాబుగారు సింహంలా ఢిల్లీ వస్తే ఎవరూ పట్టించుకోరే.. ! )
కుప్పం అంటే టిడిపి అడ్డా అనే రోజులకు కాలం చెల్లిందని వైసీపీ నిరూపించింది. కుప్పం మున్సిపాలిటీలో 25 వార్డులు ఉన్నాయి. అన్ని వార్డులకు నామినేషన్లు వేయటమే టిడిపికి పెద్ద సవాల్ గా మారింది. చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఇలాంటి దుస్థితి వస్తుందని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎప్పుడూ ఊహించి ఉండరు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
రాజకీయాల్లో ఊహకి అందని సంచలనాలను సృష్టించడంలో జగన్ తర్వాతే ఎవరైనా. అసలు కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో స్వయంగా తానే ప్రచారం చేసే పరిస్థితికి జగన్ తీసుకొస్తారని చంద్రబాబు కలలో కూడా ఊహించి ఉండరు. ఆంధ్రప్రదేశ్లో అధికారమే కాదు.. చివరికి తన సొంత నియోజకవర్గంలో కూడా రాజకీయంగా పెనుమార్పులు చోటుచేసుకున్నాయని స్థానిక సంస్థల ఎన్నికల పుణ్యమాని చంద్రబాబుకు తెలిసొచ్చింది. దీంతో కుప్పం మున్సిపాలిటీలో ఏదైనా జరగొచ్చని స్థానిక ఎమ్మెల్యేగా తన ఓటు కూడా కీలకం కావచ్చునని చంద్రబాబు భావించారు.
ఈ క్రమంలో కుప్పం మున్సిపాలిటీ Ex-Officio సభ్యునిగా చంద్రబాబు దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. తమ సొంత నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే, Ex-Officio సభ్యునిగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. కుప్పంలో హోరాహోరీ పోరును దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు అక్కడ మున్సిపాలిటీలో ఓటును రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకున్నారు అంటే ఓటమిపై చంద్రబాబులో ఎంత భయం ఉందో అర్థమవుతుంది.