దేశంలోనే సొంత వెబ్ పోర్టల్ కలిగిన ప్రాథమిక వ్యవసాయ కోపరేటివ్ సొసైటీ గా పోతుగల్ మారబోతున్నది. సిరిసిల్ల జిల్లా పోతుగల్ ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీ వెబ్ పోర్టల్ ని ఈరోజు ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ప్రారంభించారు.
సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఈ సొసైటీ ఉన్నది.ఈ పోతుగల్ సొసైటీ వెబ్ సైట్ ద్వారా రానున్న పెట్రోల్ బంకులు, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలు, ఏటీఎంలు ఆఫీస్ బిల్డింగ్ లు వంటి తదితర వివరాలన్నింటినీ కూడా సొసైటీ వెబ్సైట్లో పొందుపరిచింది.
అంతే కాకుండా ఈ వెబ్సైట్ ద్వారా పోతుగల్ సొసైటీ తాను అందిస్తున్న రుణాలు, రుణాలకు సంబంధించిన ప్రక్రియ మరియు ఇతర సేవలకు సంబంధించిన పూర్తి వివరాలను తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది. ఈ సమాచారంతో పాటు ధాన్యం సేకరణ వంటి సేవల వివరాలను, గణాంకాలను సొసైటీ కి అందుబాటులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు, లాకర్లు వివరాలను కూడా ఈ వెబ్సైట్ ద్వారా అందించనుంది. ఈ వెబ్సైట్ తెలుగు మరియు ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంచనుంది. తద్వారా రైతులకు సంబంధించిన వార్తలను, సొసైటీ అందించే ఇతర ఆఫర్లను కూడా వెబ్ సైట్ లో ఉంచనున్నట్లు తెలిపింది. ( వారిపై కోపం.. వీరికి శాపం! )
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ సొసైటీ కొరకు సొంతంగా ఒక వెబ్సైట్ ని తయారు చేయడం ద్వారా దేశంలోని ఇతర సొసైటీలకు ఆదర్శంగా నిలిచిందని ఆయన అన్నారు. ఇటువంటి మంచి ప్రయత్నం తో ముందుకు వచ్చిన సొసైటీ కార్యవర్గాన్ని మంత్రి కేటీఆర్ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నట్లు తెలిపారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …