మహారాష్ట్ర ముంబైలోని భీవండిలో సోమవారం తెల్లవారుజామున భవనం కూలిన ఘటనలో దాదాపు 20 మంది వరకు మృతి చెందారు. అయితే ఈ మరణాల సంఖ్య పెరుగుతున్నట్టు తెలుస్తుంది. బుధవారం ఉదయం నాటికి మృతుల సంఖ్య 35కు చేరినట్టు ఈ ఘటన సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెలిపారు.
శిథిలాలు తొలగిస్తున్న కొద్దీ మృతదేహాలు బయట పడుతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి.
సహాయక చర్యల్లో భాగంగా మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇప్పటివరకు దాదాపు 30 మందిని రక్షించినట్లు సమాచారం. భవనం పాతబడి శిథిలావస్థకు చేరుకోవడంతోనే ఒక్కసారిగా కుప్పకూలినట్లు తెలుస్తోంది. ( సోషల్ మీడియాలో వైరల్ .. )
రాత్రి అందరూ గాఢనిద్రలో ఉన్న సమయంలో భవనం కుప్పకూలడంతో మరణాల సంఖ్య అధికంగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మునిసిపల్ కార్పొరేషన్ అధికారులపై చర్యలు తీసుకుంటున్నట్టు సమాచారం.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …